AP Police penalty to people who are not wearing mask.
#Andhrapradesh
#Appolice
#Ysjagan
#Ysrcp
#Coronavirus
#Covid19
#WearAMask
ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండంతో అన్ని జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వందలాది కొత్త కేసులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా కరోనా నిబంధనల దుమ్ముదులుపుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీగా జరిమానాలు విధిస్తోంది. నిన్న ఒక్క రోజే కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి రూ.17 లక్షలు ముక్కుపిండి వసూలు చేసింది. దీంతో పోలీసుల్ని చూస్తే జనం బెంబేలెత్తుతున్నారు.